instruction
stringlengths
0
12.1k
input
stringlengths
0
22.2k
output
stringlengths
1
23.8k
క్రింది సంఖ్యల జాబితాలో అంకశ్రేణి ఏది ? A) 1, 3, 6, 10, 15, ……… B) 100, 80, 60, 40, ……. C) 2, 4, 8, 16, …… D) 3, 3, 4, 4, 5, 5, …….
B) 100, 80, 60, 40, …….
కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి. అ) దేవాలయాలు ఆ) సాయుధ దళాలు ఇ) అంగారకాది గ్రహాలు ఈ) యుగాంతాన్ని ఉ) నయనాంచలాలు ఊ) సంస్కారపు కేశపాశం ఎ) అనురాగపు గులాబి ఏ) కళాలయాలు
అ) దేవాలయాలు = దేవ + ఆలయాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి ఆ) సాయుధ దళాలు = స + ఆయుధదళాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి ఇ) అంగారకాది గ్రహాలు = అంగారక + ఆదిగ్రహాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధీ ఈ) యుగాంతాన్ని = యుగ + అంతాన్ని = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి ఉ) నయనాంచలాలు = నయన + అంచలాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి ఊ...
ప్రశ్న : వాతావరణంలో మిళితమైన అంశాలలో ఇప్పుడు మార్పులు వస్తున్నాయి. కారణాలు చెప్పండి.
వాతావరణం ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్ మొ||న వాయువుల మిశ్రమం. భూమి ఏర్పడినప్పుడు ఇవి వాతావరణంలో ఉన్నాయి. వాతావరణంలో మిళితమైన అంశాలలో మార్పునకు కారణాలు : వాతావరణంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగటం వలన అగ్ని పర్వత ఉద్బోధన ప్రక్రియ కారణంగా, వెలువడిన వాయువుల కారణంగా కిరణజన్యసంయోగక్రియల కారణంగా, వ్యవసాయం ...
మొక్కలలో నీటి ప్రసరణకు ఉపయోగపడునది A) పోషక కణజాలం B) బాహ్య చర్మం C) దారువు D) విభాజ్య కణజాలం
C) దారువు
వ్యాపారమును నిర్వచించండి.
సాహిత్యపరముగా వ్యాపారము అంటే నిరంతరము శ్రమిస్తూ ఉండే స్థితి. వ్యాపారాన్ని హాని దిగువ విధముగా నిర్వచించినాడు. “వస్తువు కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ ద్వారా సంపదను ఉత్పత్తి చేయడానికి లేదా ఆర్జించడానికి మళ్ళించిన మానవయత్నము వ్యాపారము”. వీలర్ అభిప్రాయము ప్రకారము “ప్రయివేటు లాభార్జనాపేక్షతో సంఘమునకు వస్తుసేవలను అందించడానికి స్...
ఆగమన పద్ధతి గురించి సంక్లిప్తంగా వివరించండి
తార్కిక విశ్లేషణ చేయడం ద్వారా ప్రత్యేక అంశాల పరిశీలన వల్ల వచ్చిన ఫలితాలు మొత్తం అంశాలకు వర్తింప చేయడం. ఉదా: క్షీణ ప్రతిఫల సూత్రం.
నిజాం-అలీ-ఖాన్ విజయాలు గురించి సంక్లిప్తంగా వివరించండి
నిజాం-ఉల్-ముల్క్ వారసుల్లో నిజాం-ఆలీ ఖాన్ (క్రీ.శ. 1762-1803),నిజాం-సికందర్ (క్రీ.శ. 1803- 1829), నాసిరుద్దాలా (క్రీ.శ. 1829-1857), ఆఫ్ఘలుద్దాలా (క్రీ.శ. 1857-1869), ఆరవ నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ (క్రీ.శ. 1869-1911), 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ (క్రీ.శ. 1911-సెప్టెంబర్ 1948) ప్రముఖులు. వీరి సుదీర్ఘ పాలనలో తెలంగాణా ప్...
కింది పదాలు చూడండి. వాటికి సంబంధించిన పదాలతో కలపండి. లేఖ, ………….., ……………, చేరడం.
లేఖ, విషయం , చిరునామా, చేరడం.
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. నీకు ఇచ్చిన పదార్థాలు వస్తువులు విద్యుత్ వాహకాలో, విద్యుత్ బంధకాలో ఏ విధంగా పరీక్షించి తెలుసుకుంటావు?
1. ఒక పదార్థం విద్యుత్ వాహకం అవునో కాదో తెలుసుకోవటానికి నేను విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేస్తాను. 2. పరిశీలించాల్సిన పదార్థాన్ని విద్యుత్ వలయంలో పెట్టినప్పుడు బల్బు వెలిగితే దాని ద్వారా విద్యుత్తు ప్రసరించింది అని అర్ధం. కావున అది విద్యుత్ వాహకం. 3. బల్బ్ వెలగకపోతే ఆ పదార్థం ద్వారా విద్యుత్తు ప్రసరించలేదు అంటే అది విద్య...
‘మహిళల రక్షణ మన కర్తవ్యం’ అనే అంశముపై కరపత్రం రాయండి.
‘మహిళల రక్షణ – మన కర్తవ్యం’ సోదర సోదరీమణులారా ! చెప్పడానికి సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ రోజూ స్త్రీలపట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై సైతం అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీలపై యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్, మానభంగాలు, హింసాకృత్యాలు నిత్యం జరుగుతున్నాయి. మన ఇంట్లో మన తల్లిని ...
వచ్చిన డిస్కౌంట్ అంటే ఏమిటి?
వ్యాపారస్తుడు తన ఋణదాతలకు గడువు తేదీ కంటే ముందు మొత్తాన్ని చెల్లించినపుడు పొందే డిస్కౌంట్ను వచ్చిన డిస్కౌంట్ అంటారు. దీనిని నగదు పుస్తకములో క్రెడిట్ వైపు డిస్కౌంట్ వరుసలో వ్రాయాలి.
మీ ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించండి. ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలను తెలుసుకుని మీ గ్రామపంచాయతీ / మున్సిపాలిటి వారికి వ్యాధులను నివారించటానికి మీరు ఏ సూచనలు చేస్తారు?
మా ప్రాంతంలో సాధారణంగా ఉండే వ్యాధులను తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాను. సర్వేలో ఎక్కువ వచ్చే వ్యాధులు డయేరియా, మలేరియా, డెంగ్యూ. ఈ వ్యాధులు నివారించటానికి మా మున్సిపాలిటీకి ఇచ్చే సూచనలు : రక్షిత మంచినీటి సరఫరా చేయాలి. ఆరోగ్య కార్యకర్తల ద్వారా వ్యాధులు వచ్చే కాలం గురించి ముందుగా వివరించాలి. ఆ వ్యాధులు రావడానికి గల క...
ఇచ్చిన కవికి కవి పరిచయం రాయండి: గద్దల శాంయూల్
కవి పేరు : గద్దల శాంయూల్ కాలం : 20వ శతాబ్దం రచన : హితోక్తి శతకం
ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి: పుట్టిననాడే తల్లిదండ్రులచేత విడువబడ్డాను. ఇప్పుడు భర్తచేత కూడా విడువ బడతాను కాబోలు. ఇక వేయిమాటలెందుకు ? పూర్వం నేను నోచిన నోముల ‘ఫలితం ఇదే కాబోలు అనుకుంటూ శకుంతల దుఃఖించింది. ఇట్లా ఎంతో దుఃఖించి, ఆశలు వదలుకొని, కన్నీరు తుడుచుకుంటూ ఇక నాకు దైవమే శరణ్యమని భావించిన ఆ పతివ్రతా శిరోమణి కొ...
” ఓ రాజా ! ఈ భరతుడు నీకూ శకుంతలకూ ముద్దుబిడ్డడు. ఈతణ్ణి స్వీకరించి పోషించు. సాధ్వి, మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో సత్యం పలికింది, అని ఆకాశవాణి రాజుకు చెప్పింది. ఈ విధంగా శకుంతల పాతివ్రత్యాన్ని గురించి, సత్యాన్ని గురించి, భరతుడి పుట్టుకను గురించి కీర్తించే దేవతల మాటలు, ఆకాశం నుంచి వెలువడగా విన్న దుష్యంతుడు సభాసదులతో ఇ...
ప్రశ్న : వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? మీ ఉపాధ్యాయులు, స్నేహితులతో చర్చించి సమాధానం వ్రాయండి.
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను క్రింది విధంగా ప్రభావితం చేస్తున్నాయి వాతావరణంలో మార్పులు మానవ జీవితంలో అభివృద్ధి సూచికగా చెప్పవచ్చును. వాతావరణంలో మార్పులు వలన మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా వ్యవసాయం, పచ్చదనం విస్తరించింది. గడ్డితినే జంతువులయిన ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు మొదలైన వాటి సంఖ...
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: క. ఒక్కఁడు ము న్నే మటి చన నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్, వే ఱోక్కఁడు ముట్టి తటాలున, నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁ గన్.
భావం : ఒకడు పరధ్యానంగా నడుస్తూంటే, ఇంకొకడు వెనుక నుండి గట్టిగా కేకపెడతాడు. అది విని వాడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు, ఇంకొకడు వెనుక నుండి వచ్చి మరొకడి కళ్ళు రెండూ మూశాడు. అది చూసి వేరొకడు నవ్వుతున్నాడు.
√p అనునది ఒక ప్రధాన సంఖ్య అయిన p యొక్క కనీస విలువ ఎంత ?
2
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు తాత్పర్యం రాయండి: ఉ. రాముని దాఁగురించి నిను రావణుఁ డెత్తుక వచ్చువేళ నీ హేమవిభూణణావళుల నేర్పడ ఋశ్యమహాద్రి వైచినన్ మేమవి తీసి దాఁచితిమి మీ పతి యచ్చటి కేఁగుదేరఁగాఁ దామరసాప్తనందనుఁడు తానవి సూపినఁజూచి మెచ్చుచున్.
ప్రతిపదార్థం : రాముని = శ్రీరాముని డాఁగురించి = మోసం చేసి నినున్ = నిన్ను రావణుడు = రావణుడు ఎత్తుకవచ్చు వేళన్ = అపహరించి తీసుకొనివచ్చే సమయంలో నీ = నీ యొక్క హేమ = బంగారముతో చేసిన విభూషణ = నగల యొక్క ఆవళులన్ = రాశిని (బంగారు నగలను) ఏర్పడన్ = కనబడునట్లుగా ఋశ్యమహాద్రిన్ = ‘ఋష్యమూకము’ అనే గొప్ప పర్వతమునందు వైచినన్ = పడవేయగా ...
విలువ ఆధారిత పన్ను (VAT) వస్తువులపై పన్ను ఎగవేతను ఏ విధంగా తగ్గిస్తుంది?
VAT అనగా (Value Added Tax) విలువ ఆధారిత పన్ను. వ్యాట్ విధానంతో ఉన్న ప్రయోజనం వస్తువులపై పన్ను ఎగవేతను అరికట్టడం. అది ఎలా అనగా ఉత్పత్తిదారులు, వర్తకుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల నమోదులో పారదర్శకత పెంపొందుతుంది. ప్రతి ఒక్కరూ సరైన రికార్డులను నిర్వహించడానికి కొనుగోలు సమయంలో బిల్లులను అడుగుతారు. ఎందుకంటే ముడి...
ఇచ్చిన భావం వచ్చేలాగా పద్యం రాయండి: సూర్యోదయం రాకపోదు. నేడు ఉన్న చీకటి రేపు ఉండకపోవచ్చు. చేయికి చేయి కలిస్తే మరింత బలం చేకూరుతుంది. మానవులంతా కలిసిమెలసి ఉంటే బాధలన్నీ మానవు.
భానూదయం కాకపోడు. నేటి చీకటి రేపురాదు. చేతికి చేయి కలిస్తే రెండవక మానవు మానవుడు మానవుణ్ణి కలిస్తే బాధలు తీరకపోవు.
ప్రశ్న : సతతహరిత అరణ్యాల గురించి క్లుప్తంగా వివరించండి.
సతతహరిత అరణ్యాలు : అధిక సాంవత్సరిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి. ఇక్కడి వృక్షాలు చాలా పొడవుగా వుండి విశాల పత్రాలను కలిగివుంటాయి. ఈ రకమైన వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించబడి గొడుగు లాగా కనిపిస్తాయి. ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉండటము వలన వీటిని సతతహరిత అరణ్యాలు అని పిలుస్తార...
స్త్రీలపట్ల మర్యాదగా ప్రవర్తించడం అంటే ఏమిటి?
స్త్రీలు శారీరకంగా, మానసికంగా సున్నితంగా ఉంటారు. వారి మనసు బాధపడేలా మాట్లాడకూడదు. కించపరచ కూడదు. వెకిలిగా ప్రవర్తించకూడదు. వారికి చట్టపరంగా సంక్రమించవలసిన హక్కులను పొందేలా చూడడం, సహాయం చేయడం, మన తల్లి, సోదరి పట్ల ఎలా ప్రవర్తిస్తామో ప్రతి స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మర్యాద.
బాహ్య ద్రవాభిసరణం మరియు అంతర ద్రవాభిసరణ ప్రక్రియలను ప్రయోగపూర్వకముగా నిరూపించుము.
బాహ్య మరియు అంతర ద్రవాభిసరణలను నిరూపించుట. కావలసిన పదార్థాలు : మూడు బీకర్లు, పెట్రెడిష్, ఉప్పు, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, రెండు సమాన పరిమాణంలో ఉన్న పచ్చి గుడ్లు, తుడవడానికి గుడ్డ, గుడ్డు చుట్టుకొలత కొలవడానికి సన్నని పొడవైన కాగితం, ఒక చెమ్చా. పద్ధతి / ప్రయోగ విధానం : గుడ్లను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నాలుగు నుండి ఐద...
ప్రశ్న : కృష్ణా, గోదావరి డెల్టాలలో ఏ జిల్లాలున్నాయో గుర్తించండి.
కృష్ణా డెల్టాలో గుంటూరు, కృష్ణా జిల్లాలు కలవు. గోదావరి డెల్టాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కలవు.
ఉత్పలమాల పద్యానికి ఈ అక్షరంతో యతి A) 11వ అక్షరం B) 10వ అక్షరం C) 13వ అక్షరం D) 14వ అక్షరం
B) 10వ అక్షరం
నిమటోడా ప్రొటోస్టోమియా సమూహానికి చెందింది కానీ యూసీలోమేట్ కాదు. ఈ వ్యాఖ్యానాన్ని సమర్థించండి.
నిమటోడా జీవులు యుసీలోమేటా జీవులు కాకపోవుటకు కారణము వీటి శరీర కుహరము మధ్యస్త్వచ ఉపకళా స్తరములతో ఆవరింపబడి ఉండదు. కాబట్టి దీనిని నిజశరీర కుహరముగా పేర్కొనరు. అందువలన దీనిని మిధ్యా శరీర కుహరముగా గుర్తించెదరు.
మొదటి జతలోని అంశాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి. సిమ్లా :హిమాలయాలు :: ఊటి
నీలగిరులు
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: చెట్టు
తరువు, వృక్షము, భూరుహము, భూజం, పాదపము
అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది?
ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ‘అన్నపాఠభాగ్యం ఆచార్య రవ్వా శ్రీహరిచే రచించబడిన ‘సాహితీ నీరాజనం’ అన్న వ్యాస సంకలనం నుండి గ్రహించబడింది. దుఃఖితులపట్ల మానవులు ఎలా ప్రవర్తించాలో అష్టాంగ హృదయకర్త చక్కగా వివరించాడు. ఏ జీవనాధారము లేనివాణ్ణి, వ్యాధితో బాధపడుతున్నవాణ్ణి, దుఃఖంలో న్నవాణ్ణి వారి వారి శక్తిని బట్టి ఆదుకోవాలని అష్టా...
మానవాభివృద్ధిని కొలవడానికి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు?
మానవాభివృద్ధిని కొలవడానికి పరిగణనలోకి తీసుకునే అంశాలు : తలసరి ఆదాయం ఆయుః ప్రమాణం అక్షరాస్యత శిశుమరణాలు – జనన రేటు జీవన ప్రమాణం ప్రజారోగ్యం
కుంభాకార కటకం నుండి వక్రీభవనం చెందిన కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంటే, ప్రతిబింబ దూరం …. A) వస్తుదూరానికి సమానం B) అనంతం C) కటక నాభ్యంతరానికి సమానం D) కటక వక్రతా వ్యాసార్ధానికి సమానం
B) అనంతం
మొదటి జతలోని అంశాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి. సర్కార్. తీరం : ఆంధ్రప్రదేశ్ :: ఉత్కల్ తీరం
ఒడిశా
మాతృభాషలో విద్యను నేర్చుకోవడం (విద్యలో మాతృభాష ప్రాముఖ్యం) మీద వ్యాసం రాయండి.
మాతృభాష అంటే తల్లిభాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం. పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముం...
స్వేచ్ఛకు గల ఏవైనా మూడు పరిరక్షణలను వివరించండి.
1. ఆర్థిక సమానత్వం: వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. ద...
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి. హిమాలయాల్లో అన్నిటి కంటే దక్షిణంగా ఉన్న శ్రేణి ఏది?
శివాలిక్.
ఇచ్చిన సంధి గురించి రాయండి మరియు ఉదాహరణలు కూడా రాయండి: యడగమ సంధి
సంధి లేని చోట స్వరంబు కంటె పరంబయిన స్వరమునకు యడాగమంబగు. నీయనుజులు = నీ + అనుజులు = యడగమ సంధి తూలినయట్లు = తూలిన + అట్లు = యడగమ సంధి
అసాధ్య ఘటన సంభావ్యత 1. (సత్యం / అసత్యం)
అసత్యం
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: మ. వితతోల్కాశనిపుంజ మొక్క యనఁగా విన్వీథి విక్షిప్త ప క్షతి వాతాహతిఁదూలి, తూల శకలాకారంబుఁ లై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జెదరఁగాఁ బాటెన్ మనోవేగుఁడై పతగేంద్రుం డమృతాంతికంబునకుఁ దత్పాలుర్ భయం బందఁగన్.
భావం : పక్షి రాజు మనోవేగంతో బయలుదేరాడు. అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోక చుక్కలా ఉన్నాడు. ఆకాశంలో కదలుతూ ఉన్నప్పుడు, అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్నవారు భయపడేటట్లుగా, గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్నచోటికి వెళ్ళాడు.
ప్రియసఖా! నీ లేఖ అందింది. పట్నం జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. నీది ఉత్తమమైన వాంఛ. ఒకచోటి జీవిత విధానంలో మరొకచోటి జీవిత విధానాన్ని నిత్యమూ పోల్చి తెలుసుకొంటూ ఉండాలి. మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ వాంఛ నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను...
లేఖా రచయిత పల్లెటూరి వాడు. పేదవాడు. పట్నవాసంలో సుఖం ఉందని అతని భావన. పల్లెటూరి జీవితం, పట్నవాసపు జీవితం పరస్పర విరుద్ధమైనవని అతని భావం.
ఇచ్చిన వ్యాక్యంలో తప్పు ఉంటె సరిచేసి రాయండి: కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన గ్రసని అనే పోలికను గుర్తించుట భాగం మూత వలె పనిచేస్తూ మరియు ఆహారాన్ని స్వరపేటిక ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన ఉపజిహ్విక అనే భాగం మూత వలె పనిచేస్తూ మరియు ఆహారాన్ని స్వరపేటికలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
కింద ఇచ్చిన పదంతో సొంత వాక్యం రాయండి: చెవి వారిచ్చి
మా నానమ్మ చెప్పే కథలను చెవి వారిచ్చి వింటాను.
అనురూప సంప్రదాయాన్ని వివరించండి.
ఈ సంప్రదాయము ప్రకారము గణక నియమాలు, ఆచరణ పద్ధతులు ప్రతి సంవత్సరము ఒకే రకముగా ఉండాలి. వాటిని మార్చకూడదు. ఆ విధముగా ఉంటేనే ఒక సంవత్సరము ఫలితాలు మరొక సంవత్సరము ఫలితాలతో పోల్చడానికి అవకాశము ఉంటుంది. ఉదా: వ్యాపార సంస్థ స్థిరాస్తులపై తరుగుదలను స్థిర వాయిదాల పద్ధతి లేదా తగ్గుతున్న నిల్వల పద్ధతి, ఏదైనా ఒక పద్ధతిలో మాత్రమే ప్రతి...
నలుగురు స్నేహితులు కలసి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ అద్దెను నలుగురు కలసి చెల్లిద్దామనుకున్నారు. అద్దె నెలకు రూ. 2000. – వారి మధ్య ఆ అద్దె ఎలా పంచబడుతుంది? – వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు. ఈ వ్యయాన్ని వేరోక రకంగా వాటాలు వేస్తే, వారిలో ఒక్కొక్కరు అనుభవించే బాధ ఒక...
సమానంగా పంచబడితే ఒక్కొక్కరికి రూ. 500 చొ||న వస్తుంది. అలాగాక వారి ఆదాయం నిష్పత్తిని పరిగణనలోనికి తీసుకుంటే దాని ప్రకారం అద్దె పంచితే (వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000 లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు.) ఈ వ్యయాన్ని వేరొక రకంగా కాక వారి ఆదాయ నిష్పత్తి ప్రకారం పంచితే 3000 : 7000 రూ. 600 ‘లు రూ. 1400...
కూచిపూడి నాట్యకళపై కృషిచేసినవారి గురించి చర్చించండి. వారి కృషిని మీరు ఎలా అభినందిస్తారు?
సిద్ధేంద్రుడు అనే యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు. సిద్ధేంద్రుడి తర్వాత ‘భాగవతుల రామయ్య – గారు పేరు పొందారు. తరువాత ‘కేళిక’, యక్షగానము వచ్చాయి. కందుకూరి రుద్రకవి యక్షగాన రచనకు మొదటివాడు. నృత్య నాటకాలను రామానుజయ్య సూరి, తిరునారాయణాచార్యులు రూపొందించారు. నృత్య రూపక, నృత్య నాటికలను, వెంపటి చినసత్యం, కేళికను వేదాంతం ర...
కింద ఇచ్చిన భావం వచ్చేలాగా పద్యం రాయండి: మతిమంతుడైన భీష్ముడు తన మనమళ్ళనందరినీ ద్రోణునికి చూపించి, వీరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్యలన్నింటినీ నేర్పుము. విలువిద్యలో నీతిలో, పరాక్రమం లో పరశురాముడు కూడా నిన్ను పోలడని విన్నాను.
మనుమలనెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు ‘వీరింజే’ కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరకరాసిన విద్యలెల్లఁ బెం పున జమదగ్నిసూనుఁడును బోలందు నిన్నని విందు విల్లునే ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమ గర్వసంపదన్
గుణశ్రేణి యొక్క క్రింది వానిని జతపరుచుము. √3, √6, 2√3, 2√6, ………… i) మొదటి పదం a a) 4√3 ii) సామాన్య నిష్పత్తి r b) √3 iii)3వ పదము a3 c) 2√3 iv) 5వ పదము a5 d) √2 A) i-a, ii-c, iii-b, iv-d B) i-b, ii-a, iii-d, iv-c C) i-b, ii-d, iii-c, iv-a D) i-b, ii-a, iii-c, iv-d
C) i-b, ii-d, iii-c, iv-a
ఊహించిన సగటు పద్దతిలో సగటు గణించడంలో వాస్తవ సగటు, ఊహించిన సగటుకు సమానం అయితే Σfidi, విలువ ఎంత ?
Σfidi = 0
కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి. 1. సౌకర్యం 2. ప్రధానము 3. ప్రాచీనము 4. గట్టిగా 5. నిర్భయం 6. సందిగం 7. సాధారణం 8. వాస్తవం
1. సౌకర్యం × అసౌకర్యం 2. ప్రధానము × అప్రధానము 3. ప్రాచీనము × నవీనము 4. గట్టిగా × నెమ్మదిగా. 5. నిర్భయం × భయం 6. సందిగం × అసందిగం 7. సాధారణం × అసాధారణం 8. వాస్తవం × అవాస్తవం
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అణువుల మధ్య పనిచేసే అంతర్ అణుబలాల స్వభావం ఆధారంగా కింది ఘనపదార్థాలను భిన్న రకాలుగా వర్గీకరించండి. పొటాషియమ్ సల్ఫేట్, టిన్, బెంజీన్, యూరియా, అమోనియా, నీరు, జింక్ సల్ఫైడ్, గ్రాఫైట్, రుబీడియమ్, ఆర్గాన్, సిలికాన్ కార్బైడ్.
అయానిక పదార్థాలు : K2SO4, ZnS సంయోజనీయ పదార్థాలు : గ్రాఫైట్, SiC అణు ఘన పదార్థాలు : బెంజీన్, యూరియా, NH3, H2O, Ar లోహ ఘన పదార్థాలు : రుబీడియం, టిన్
ఇచ్చిన అంశం గురించి చర్చించండి. “కుటుంబం – సమాజం అభివృద్ధిలో స్త్రీల పాత్ర”
వ్యక్తులు లేనిదే కుటుంబం లేదు. కుటుంబాలు లేనిదే సమాజం లేదు. వ్యక్తిని బట్టి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబాలను బట్టి సమాజం అభివృద్ధి చెందుతుంది. కుటుంబమైనా, సమాజమైనా ఏర్పడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా స్త్రీలది కీలకపాత్ర. “ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతమౌతుంది” అన్నారు జవహర్‌లాల్ నెహ్రూ. కుటుంబ...
ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి: పల్నాటిసీమలో క్రీ.శ. 12వ శతాబ్దంలో జరిగిన చారిత్రకగాథే పల్నాటి వీరచరిత్ర. మహాభారత కథతో సామ్యం ఉండటం వల్ల పల్నాటి వీరచరిత్రను ఆంధ్రభారతం అనీ, పల్నాటి వీరభారతం అనీ అభివర్ణిస్తారు. అనుగురాజు గురజాలను రాజధానిగా చేసుకొని పల్నాటి రాజ్యాన్ని పాలించేవాడు. ఆ రాజుకు మైలమాదేవి, విద్యలదేవి, భూర...
నలగామునికి ప్రధానిగా బ్రహ్మనాయుని ప్రతిష్ఠను ఆమె సహించలేకపోయింది. నలగామునికి లేనిపోనివి నూరిపోసింది. నాగమ్మ చెప్పుడు మాటలు విన్న నలగామరాజు తమ్ములైన మలిదేవాదులను చెరసాలలో బంధించాడు. కుటుంబ కలహాలను నివారించటానికి మధ్యవర్తిత్వం చేసి రాజ్యాన్ని రెండుగా విభజించాడు. నలగాముని భాగానికి గురజాల రాజధాని, మలిదేవుని భాగానికి మాచర్ల...
హరప్పా మత జీవితంలోని ప్రధాన లక్షణాలను రాయండి.
సింధూ ప్రజల మతం ఆచారాలు వివిధ నమ్మకాలతో కూడుకొన్నవి అని ఆచార్య వీలర్ పండితుని అభిప్రాయం. సింధూ త్రవ్వకాలలో ఎటువంటి దేవాలయములు గాని, దేవతా ప్రతిమలు గాని దొరకలేదు. అయితే సింధూ త్రవ్వకాలలో దొరికిన వివిధ ‘ముద్రల’ (సీల్స్) పై ఉన్న చిత్రాలు మరియు టేరాకోటా (మట్టి) బొమ్మల ద్వారా వారి మతం ఆచారాలు మెచ్చుకోవచ్చును. ఎ) టేరాకోటా –...
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉన్నది?
ఒడిషా.
A ⊂ B అయిన n(A ∪ B) = ________ A) n(A) B) n(B) C) n(A ∩ B) D) 0
B) n(B)
కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ దైనందిన లయలు జంతువులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్ల ఆకులు మన మాదిరిగా రాత్రికాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకొని ఉండి, సాయంత్రానికి వాలిప...
1. ఏ పూవును పగటివేళ, కటికచీకటి గదిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు? జవాబు: మల్లెపూవును పగటివేళ కటిక చీకటిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు. 2. జీవగడియారాలకు గల మరొక పేరు ఏమి? జవాబు: జీవగడియారాలకు గల మరొక పేరు శరీరధర్మ గడియారాలు. 3. లయలు జంతువులకు మాత్రమే కాకుండా వేటికి ఉంటాయి? జవాబు: లయలు జంతువులకు మాత్రమే కాకుండా...
చరిత్ర రచనా శాస్త్రానికి ఇబన్ ఖల్టూన్ చేసిన సేవలు తెలపండి.
మధ్య ప్రాచ్యంలో ఇస్లాం మత ఆవిర్భావంతో చరిత్ర రచనలో మార్పులు చోటుచేసుకొన్నాయి. చరిత్రపట్ల ఆసక్తిగల అరబ్బులు మత ప్రేరణతో చరిత్ర రచనలో ధోరణులు, పోకడలను అనుసరించారు. అటువంటి చరిత్రకారుల్లో చరిత్రను సంస్కృతీ శాస్త్రంగా తీర్చిదిద్దిన ఇబన్ ఖల్టూన్ ప్రముఖుడు. చరిత్ర అనేది గత సంఘటనలను, వాటి వెనక ఉన్న కోణాలను తార్కికంగా వివరించ...
ఉత్పత్తి సంస్థలను నిర్వచించండి.
వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడిసరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువలను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను రాయండి.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు నాలుగు. అవి: ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ నివేదన పునరాయనము ప్రజాభిప్రాయ నిర్ణయం.
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి హెలికాప్టరనకు తప్పని సరిగా రెండు ప్రొపెల్లర్లు ఎందుకు ఉండవలయును?
హెలికాప్టర్నకు ఒకే ప్రొపెల్లర్ ఉన్నచో, అది తిరుగుచున్నపుడు, కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం, దానికి వ్యతిరేక దిశలో హెలికాప్టర్ తిరుగును. అందువలన హెలికాప్టర్ నకు రెండు ప్రొపెల్లర్లు ఉండును. ఒకటి, హెలికాప్టర్ పైన ఉండును. రెండవది హెలికాఫ్టర్ తోక భాగమున ఉండును. పైన ఉన్న ప్రొపెల్లర్ ఒక దిశలో భ్రమణము చెందుచున్నపుడు, ద...
తత్పురుష సమాసము గురించి వివరించి ఉదాహరణలు ఇవ్వండి.
తత్పురుష సమాసము : ఉత్తర పదార్థ ప్రధానము తత్పురుషము. అనగా సమాసంలోని రెండవ పదము యొక్క అర్థము ప్రధానంగా గలది. రాజభటుడు వెళ్ళెను – వెళ్ళినది భటుడు. పూర్వ పదమునకు విగ్రహవాక్యంలో చేరే విభక్తిని బట్టి సమాసం పేరుండును. i) ప్రథమా తత్పురుష – అర్ధరాత్రి – రాత్రి యొక్క అర్థభాగము – మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యభాగము ii) ద్వితీయ...
కింది పదాలను విడదీయండి. సంధి జరగని విధానాన్ని గమనించండి. ఉదా : మాయమ్మ = మా + అమ్మ 1. మాయయ్య 2. ఓయమ్మ 3. దూతయితడు 4. మాయిల్లు
1. మాయయ్య = మా + అయ్య 2. ఓయమ్మ = ఓ + అమ్మ 3. దూతయితడు = దూత + ఇతడు 4. మాయిల్లు = మా + ఇల్లు పూర్వ స్వరంగా ‘ఆ’ అనే అచ్చు ఉంది. పర స్వరంగా ‘అ’ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు. అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ‘య్’ వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరగని స్థితిని ‘నిషేధం’ అంటారు.
కింద ఇచ్చిన భావం వచ్చేలాగా ఒక పద్యాన్ని రాయండి మరియు రాసిన పద్యంలో ప్రతి పదంకి అర్ధము రాయండి మహిమాన్వితుడైన ఆ శివుని మనస్సులో సానుభూతి కలిగింది. అపుడు కన్నులు తెరచి ఆకలి, ఆకలి అంటూ తన భిక్షాపాత్రయైన బ్రహ్మకపాలం కోసం చేయి చాపాడు.
ఆర్థమైనది ఆ మహామహుని అంతఃకరణ అంతట అక్షులు విప్పి ‘ఆకలి ! ఆకలి’ అంటూ భిక్షాపాత్రకు చేయి చాపినాడు. ప్రతిపదార్థం : ఆర్ధము = సానుభూతి / జాలి మహామహుడు = మిక్కిలి మహిమ గలవాడు శివుడు అంతఃకరణ = మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అక్షులు = కన్నులు భిక్షాపాత్ర = శివుని భిక్షాపాత్రయైన కపాలం
కింద ఇచ్చిన పద్యానికి భావం రాయండి: తే. సత్యసూక్తి ఘటించు ‘ధీజడిమ మాన్చు గౌరవమొసంగు జనులకు గలుషమడఁచు గీర్తిఁ బ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁ జేయు సాధుసంగంబు సకలార్థ సాధకంబు. – సుభాషిత రత్నావళి
మంచి వారితో స్నేహం అన్ని కార్యాలనూ సాధిస్తుంది. సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. మందకొడి తనాన్ని పోగొడుతుంది. గౌరవాన్ని ఇస్తుంది. పాపాలను పోగొడుతుంది. మనస్సును బాగుచేస్తుంది. కీర్తిని వ్యాపింప జేస్తుంది. లోకంలో అది చేయలేని మంచిపని అంటూ ఉండదు.
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు తాత్పర్యం రాయండి: వ. అనియిట్లు తాత్పర్యంబునఁ బట్టునట్లుగా విన్నవించి దేవీ ! నీ దేవుండయిన శ్రీరాముందు నాచేతి కిచ్చి యంపిన నూత్న రత్నాంగుళీయకంబు నీకు సమర్పించితి నింక వాకు రిక్త హస్తంబులతోఁ జనుట దూతల కుచితమైన కార్యంబు గాదు గావున నిన్ను దర్శించినందులకు శ్రీరామునకును నమ్మిక పుట్టునట్టు...
ప్రతిపదార్థం : అని = అని ఇట్లు = ఈ విధముగా తాత్పర్యంబునన్ = ఆసక్తితో పట్టునట్లుగా = గ్రహించేటట్లుగా విన్నవించి = తెలిపి దేవి = సీతాదేవి ! నీ దేవుండు + అయిన = నీకు ప్రభువు అయిన శ్రీరాముండు = శ్రీరాముడు నీ చేతికిన్ = నీ చేతికి ఇచ్చి = ఇచ్చి అంపిన = పంపిన నూత్న= కొత్తదియైన రత్న = రత్నములు పొదిగిన అంగుళీయకంబు = ఉంగరమును నీ...
పోషకకణజాల మృదుకణజాలం విధి ఏమిటి?
పోషణ కణజాల మృదు కణజాలం పొడవైన స్థూపాకార కణాలలో, ఎక్కువ కణ ద్రవ్యంను కేంద్రకంను కల్గి ఉంటుంది. ఇది ఆహార పదార్థాలతో పాటు రెసిన్స్, లేటెక్స్, జిగురు వంటి పదార్థాలను నిల్వచేస్తుంది.
ఓటమి కలిగినపుడు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది? వివరించండి.
సాధారణంగా ఓటమి మానవుని కుంగదీస్తుంది. నీరసింపజేస్తుంది. శూన్యుడిగా మారుస్తుంది. అయితే మానవుడు ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలని బోధించాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఉపదేశించాడు. పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనుక దాగున్న క...
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: మ|| తలయెత్తెన్ గద, నీదు చాతురి యజంతాగహ్వరశ్రేణి గే వల పాషాణములందు; జీవకళ నిల్పంజాలు నీ సుత్తిలో మొలుచు న్మానవ విగ్రహంబులు; మహాపుణ్యుండవయ్యా ! హరి త్తులు, నీ బొమ్మలచెంత ముగ్ధగతినందున్; శిల్పికంఠీరవా!
భావం : ఓ శిల్పి శ్రేష్ఠుడా ! అజంతా గుహలలో నీ శిల్పనైపుణ్యం వెల్లడయ్యింది కదా ! నీ సుత్తి, వట్టి బండరాళ్ళలో కూడా జీవకళను నిలుపగలదు. నీ సుత్తిలో నుండి మానవ విగ్రహాలు పుడతాయి. నీవు పుణ్యమూర్తివి. నిజమైన సింహాలు సైతం, నీ శిల్పాలను చూచి ముగ్ధములు అవుతాయి. విశేషం : ‘హరిత్తులు అంటే ‘సింహాలు’ అని, దిక్కులు అని అర్థం. శిల్పంగా...
10వ తరగతి విద్యార్థిని పరీక్షించిన వైద్యుడు అతని శరీర ఉష్ణోగ్రత 310K గా చెప్పాడు. ఆ విద్యార్థి శరీర ఉష్ణోగ్రత సెల్సియస్ మానంలో ……. A) 273°C B) 30°C C) 98.4°C D) 37°C
D) 37°C
ఇండియాలో ఎలాంటి నదులు ఉన్నాయ్
ఇండియాలో చాల నదులు ఉన్నాయ్ గంగ,యమునా,కృష్ణ..
అయ్యలరాజు రామభద్రుని కవితా విశిష్టతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
తిరుపతి, x x x x ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు, నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మా తెలుగు పాఠ్యాంశాల్లో సముద్రలంఘనం పాఠం ఒకటి. ఇది వర్ణనాత్మక పాఠం. దీన్ని అయ్యలరాజు రామభద్రుడు అనే కవి రచించాడు. రామభక్తుని వర్ణనాత్మక రచన అందరిని ఆకట్టుక...
కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1962వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుండి ఐ.ఎ.యస్.కు ఎంపికయిన నాదెళ్ళ యుగంధర్ నాయుడిది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. వీరి శ్రీమతి ప్రభావతి. ఈ దంపతులకు 1967లో సత్య నాదెళ్ళ జన్మించారు. కలెక్టరుగా, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రణాళికాసంఘ ...
1. సత్య నాదెళ్ళ ఏ జిల్లాలో జన్మించాడు? జవాబు: సత్య నాదేళ్ళ అనంతపురంలో జన్మించాడు. 2. సత్య నాదెళ్ళ ఏ సంవత్సరంలో జన్మించాడు? జవాబు: సత్య నాదేళ్ళ 1967లో జన్మించాడు. 3. సత్య నాదెళ్ళకు ఏ ఆట అంటే ఇష్టం? జవాబు: సత్య నాదేళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. 4. షికాగో యూనివర్సిటీ నుండి ఏ డిగ్రీ పొందాడు? జవాబు: చికాగో యూనివర్సిటీ ...
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఏవి ?
e – వ్యాపారం వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు : e – వ్యాపారము వలన వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ సమయంలోనైనా వ్యాపార వ్యవహారాలు నిర్వహించవచ్చు. e – వ్యాపారము వినియోగదారులకు వస్తు సేవలకు సంబంధించి, అనేక ప్రత్యామ్నాయాలు, అవకాశాలు కల్పిస్తాయి. e – వ్యాపారము ద్వారా వినియోగదారుడు అనేక ప్రాంతాలలోని మార్కెట్లలో వస...
కింద ఇచ్చిన పదంతో సొంత వాక్యం రాయండి: చెరగని త్యాగం
తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న విద్యార్థులు చెరగని త్యాగంగా మిగిలారు.
భూమిపై ఆకుపచ్చని మొక్కలు లేకపోతే ఏమౌతుంది? A) ప్రాణికోటికి O2 అందదు B) ప్రాణికోటికి CO2 అందదు C) ప్రాణికోటికి N2 అందదు D) పైవన్నీ
A) ప్రాణికోటికి O2 అందదు
ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి: ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా !’ అన్న పాట మహిళలపై జరుగుతున్న గృహ హింసలు, స్త్రీల వరకట్న చావులను ప్రతిబింబిస్తుంది. ఈ పాటకు ప్రకాశం జిల్లా టంగుటూరులో ‘ఇందిర’ అనే పేరుగల కొత్త పెళ్ళికూతురు వరకట్న హత్యకు బలై పోవటం ప్రేరణనిచ్చింది. కర్మ భూమిగా పేరు పొందిన భారతదేశాన పుట్టిన ఓ. పువ్వు వంటి మ...
చీకటి చితిలో శవానివయ్యావా! రాక్షస విలువలతో రాజ్యమేలుతున్న నరకాన్ని గుర్తుకు తెస్తున్న ఈ సంఘంలో మానవ సంబంధాలు మార్కెట్లో సరుకులయ్యాయి. ఆడపడుచులు ఆడవారికే శత్రువులయ్యారు. అత్త కన్నులు నిప్పులు చెరిగి మలమల మాడి బొగ్గయ్యావా! ఆడవారి కంటే అడవిలో మానుకే ఈ సమాజం విలువను ఇస్తుంది. ఆరడి పెట్టిన ఆడపడుచుకూ అత్తారింటిలో, ఆరళ్ళు తప...
L1 = 2x + 2y – 8 = 0 మరియు L2 = x + y – 4 = 0 లు ఏకీభవించే రేఖలు మరియు L1 = kL2 గా రాస్తే k విలువ ఎంత?
L1 = 2x + 2y – 8 = 0, L2 = x + 2y – 4 = 0 = 1/2 (2x + 2y – 8) = 0 L2 = (1/2)L1 ⇒ L1 = L2 ∴ k = 2
క్రింది వానిలో భూగోళం వేడెక్కటాన్ని నియంత్రించే చర్య కానిది. → చెట్లు పెంచడం. → సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరించటం. → ప్రజా రవాణాను ఉపయోగించడం. → శిలాజ ఇంధనాల వాడకం పెంచటం.
శిలాజ ఇంధనాల వాడకం పెంచడం.
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఘనపదార్థాల ఉపరితలాలపై వాయువుల అధిశోషణం సాధారణంగా ఎంట్రోపి తగ్గుదలతో జరుగుతుంది. అయితే అది అయత్నీకృత చర్యగానే ఉంటుంది. వివరించండి.
అధిశోషణానికి సంబంధించిన వేరొక ముఖ్య అంశం అధిశోషణోష్ణం. అధిశోషణం ప్రక్రియలో అధిశోషకం ఉపరితలంపై ఉండే అవశేష బలాల సంఖ్య తగ్గుతుంది. అంటే ఉపరితల శక్తి తగ్గుతుంది. ఇలా తగ్గిన శక్తి ఉష్ణరూపంలో వెలువడుతుంది. కాబట్టి అధిశోషణ ప్రక్రియ ప్రధానంగా ఉష్ణమోచక చర్యగానే ఉంటుంది. అంటే అధిశోషణం ∆H విలువ రుణ విలువలో ఉంటుంది. అధిశోషణం ప్రక్...
ప్రశ్న : చిహ్నాలు మనకు సమాచారాన్ని ఎలా ఇస్తాయి?
స్కేల్ పటంలోని ముఖ్యమైన అంశం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు గీతలతో సూచిస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించుట వలన పటాలను గీయడం, చదవడం...
ఈ కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి రాయండి. ఉదా : ఏమిటా కథ = ఏమిటి + ఆ కథ – (ఇ + ఆ = ఆ) = ఇత్వసంధి 1. జీవగడ్డయి 2. భాగ్యసీమయి 3. చేసుకోవాలని 4. సెలవిచ్చి 5. రానిదని 6. ఎవరికెంత 7. వచ్చిందిప్పుడు 8. కవితలల్లిన
1. జీవగడ్డయి = జీవగడ్డ + అయి = (అ + అ = అ) = అత్వసంధి 2. భాగ్యసీమయి = భాగ్యసీమ + అయి = (అ + అ = అ) – అత్వసంధి 3. చేసుకోవాలని = చేసుకోవాలి + అని = (ఇ + అ = అ) = ఇత్వసంధి 4. సెలవిచ్చి = సెలవు + ఇచ్చి = (ఉ + ఇ = ఇ) = ఉత్వసంధి 5. రానిదని = రానిది + అని = (ఇ + అ = అ) = ఇత్వసంధి 6. ఎవరికెంత = ఎవరికి + ఎంత = (ఇ + ఎ = ఎ) = ఇత్...
గంగా – సింధూ మైదానం ఏర్పడిన విధము మరియు మైదాన భాగాలను గురించి వివరింపుము.
1. మూడు హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు, వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. 2. మొదట్లో (2 కోట్ల సంవత్సరాల క్రితం) అది తక్కువ లోతు ఉన్న పళ్లెం మాదిరి ఉండేది. 3. హిమాలయాల నుంచి నదులు తెచ్చిన రకరకాల ఒండ్రుమట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చింది. భారతదేశంలోని గంగా-సింధూ నదీ మైదానాన్ని ప్రధానంగా మూడు ...
ప్రశ్న : గ్లోబు, పటాలను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తామో వివరించండి.
గ్లోబుని ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే గ్లోబు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం – ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గ్లోబు ఉపయోగం తక్కువ. అటువంటి పరిస్థితులలో మనం పటాలను ఉపయోగిస్తాం.
త అక్షరంతో మొదలయ్యే పదాలు మరియు వాటి అర్ధాలు ఇవ్వండి
తడయు = ఆలస్యంచేయు తడవ = మారు, మాటు, సారి (మొదటిసారి) తంత్రం = ఉపాయం తన్మయులు = తత్స్వరూపమైనవారు, తమను తాము మరచినవారు తమం = చీకటి తర్కం = ఊహ, కారణం, కోరిక, ఒక శాస్త్రం తాపసులు = తపస్సుచేసుకునేవారు తారక = చుక్క తారాడడం తిరుగులాడడం, జీరాడడం తాల్మి = క్షమ, ఓర్పు తిమిరం = చీకటి తుల్యం = సమము, సరి తొంటి = తొల్లి, మొదటి, తొలు...
30 కూపన్లు గల ఒక లక్కీ డిప్లో గోపి 2 కూపన్లు కొన్నాడు. అయిన అతడు ఆ లక్కీ డిప్ గెలుపొందగల
n(S) = 30, n(E) = 2 ∴ P(E) = 2/30 = 1/15
శ అక్షరంతో మొదలయ్యే పదాలు మరియు వాటి అర్ధాలు ఇవ్వండి
శతాబ్దం = నూరు సంవత్సరాల కాలం శాంతుడు = శాంతిగలవాడు శిలోంఛప్రక్రములు = శిలప్రక్రములు (పొలాల్లో రాలిన కంకుల (గింజల) ను ఏరుకొని బ్రతికేవాళ్ళు) ఉంఛప్రక్రములు (రోళ్ళ దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు)
తెలుగు వ్యావహారిక భాషలో తరచు వాడే కింద ఇచ్చిన జాతీయం గురించి వివరించండి: గజ్జెకట్టడం
ఎవరైనా నాట్యం చేయడానికి ఆరంభంగా ముందుగా కాళ్ళకు గజ్జెలు కడతారు. ఏదైనా ఒకపని ఆరంభమైందనే విషయాన్ని తెలియ జేసే సందర్భంలో దీన్ని వాడుతారు.
ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం A) శ్వా సనాళిక B) వాయుగోణులు C) క్రిస్టే D) నెఫ్రాన్
A) శ్వా సనాళిక
ఏవైనా రెండు రాజనీతి శాస్త్ర ఆధునిక నిర్వచనాలను రాయండి.
ఆధునిక రాజనీతిశాస్త్రజ్ఞులు రాజనీతిశాస్త్ర నిర్వచనాలను రెండు ఉప తరగతులుగా విభజించారు. అవి: i) రాజనీతిశాస్త్రం – శక్తి అధ్యయనం: 1. లాస్వెల్, కాప్లాన్: “రాజనీతిశాస్త్రం ఒక అనుభవాత్మక శాస్త్రంగా ఉంటూ అధికార రూపకల్పన, అధికారుల భాగస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంది”. 2. విలియం.ఎ.రాబ్సన్: “రాజనీతిశాస్త్రం ప్రధానంగా సమాజంలో అ...
ఫెరిటిమాలో ఎన్ని రకాల వృక్కాలు కలవు ? వాటిని వివరించండి.
ఫెరిటిమాలో మెలికలు తిరిగిన నాళికల లాంటి వృక్కాలు విసర్జక అవయవాలు. ఇవి ఖండిత విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి మూడు రకాలు. 1) విభాజకాయుత వృక్కాలు : ఇవి ఖండితాంతర విభాజక పటలానికి ఇరువైపులా 15/16 ఖండితాల నుంచి చివరి వరకు ఉంటాయి. ఇవి పేగులోకి తెరుచుకుంటాయి. 2) త్వచ వృక్కాలు : ఇవి మూడో ఖండితం నుంచి చివరి ఖండితం వరకు శరీర కు...
క్రింది ఇచ్చిన పేరాగ్రాఫును చదివి దిగువ ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాయండి. శాంతి, సౌభ్రాతృత్వం అనే సందేశాలను పంచుతూ గాంధీజీ శిబిరాలలోనూ, ఆసుపత్రులలోనూ తలదాచుకుంటున్న అల్లర్లకు గురైన ప్రజల మధ్య గడిపాడు. తను ఇంతగా కష్టపడింది. ఇటువంటి స్వేచ్ఛ, స్వరాజ్యాల కోసం కాదు. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిపిత ఎటువంటి సంబరాలు చేసుక...
భారత్ వైపు ఉన్న ముస్లింలలో, పాకిస్తాన్ వైపు ఉన్న హిందువులలో అభద్రత ఏర్పడింది. ఇళ్ళు, ఊళ్ళు విడిచి వెళ్ళవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, విద్వేషం చెలరేగాయి. 1.5 కోట్ల మంది హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు. అనేకులు పునరావాస శిబిరాలలో గడిపారు. హత్యలు, దోపిడీలు, దహనాలు కొనసాగాయి. జనం రెండు నుండి ఐదు లక్షలమంది చంప...
ఇచ్చిన పద్యంకి ప్రతిపదార్థాలు రాయండి. “ఆ-యేమీ ? మౌహిత్య మోర్వన్ జుమీ”
ఆ – యేమీ = (ఆశ్చర్యం, కోపం కలిపి) ఆ ఏమిటి ? పుణ్య + ఆవాసమున్ = పుణ్యానికి నిలయమైన ఒక = ఒక రాణివాసమును = రాణివాసాన్ని తెచ్చినావా = బందీగా తీసుకొచ్చావా? ఏ హైందవుఁడు + ఐననూ = హైందవుడు ఎవడైనా ఈ గతిన్ – = ఈ విధంగా అమర్యాదన్ = మర్యాద తప్పి (మర్యాద లేకుండా) ప్రవర్తించును + ఏ = ప్రవర్తిస్తాడా? మా + ఆజ్ఞన్ = నా ఆజ్ఞను గమనింపవు ...
క్రింద ఇచ్చిన గద్యాన్ని సంక్షిప్తీకరణ చెయ్యండి: రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా, నైతికంగా అణచివేతకు గురయింది స్త్రీ. మహిళల ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని సాహిత్యం ద్వారా అక్షరీకరిస్తే దాన్ని ‘స్త్రీవాద సాహిత్యం ‘ అంటారు. తమ తల్లిదండ్రులే తమను చిన్న చూపు చూడటం, సోదరులు తమ మీద పెత్తనం చెలాయించడం, సమాజం విధించే ఆంక్షలు,...
సమాజంలో స్త్రీ అణచివేతకు గురి అయింది. స్త్రీల ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని సాహిత్యం ద్వారా చెస్తే దానిని స్త్రీవాద సాహిత్యమంటారు. తల్లిదండ్రుల, సోదరుల, అత్తమామల, భర్త, చివరకు తమకు పుట్టిన సంతానం కూడా వారిని పనికిరాని వారిగా చూస్తుంది. విదేశీ పాలన వల్ల, సంఘసంస్కర్తల కృషి వలన మహిళల ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమ సమస్య...
శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? దీనివల్ల గతంతో పోలిస్తే, నేడు దేంట్లో ఏమి మార్పులు వచ్చాయి?
శాస్త్రజ్ఞానం అన్ని రంగాలలోనూ అభివృద్ధి అయ్యింది. ముఖ్యంగా సమాచార రంగంలో, అణుశక్తి రంగంలో, విద్యుచ్ఛక్తి సాధనాల తయారీలో, కంప్యూటర్ రంగంలో, ఇంటర్నెట్ రంగంలో, ప్రయాణ సాధనాల్లో, ఎన్నో మార్పులు వచ్చాయి. వైద్య రంగంలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందడం వల్ల కేన్సర్, గుండెపోటు, మోకాలు మార్పిడి వంటి అసాధ్యమైన రోగాలకు చికిత్సలు సాధ్య...
కోరికల సమన్వయం గురించి సంక్లిప్తంగా వివరించండి
వస్తుమార్పిడి పద్ధతిలో అమ్మకందారుడు ఏ వస్తువునయితే మార్పిడి కింద ఇవ్వడానికి అంగీకరిస్తాడో ఆ వస్తువునే కొనుగోలుదారుడు అంగీకరించవలసి వచ్చేది. కొనుగోలుదారుడు, అమ్మకపుదారుల కోరికలు ఒకే విధంగా కలవవలసిన అవసరం ఉంటుంది. దీనినే కోరికల సమన్వయం అంటారు.
కింద ఇచ్చిన మొదటి పేరా మరియు చివరి పేరా అనుసరించు మధ్య పేరా రాయండి: మొదటి పేరా: బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగు శాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేసి, దానికి కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్ల...
బిరుదురాజు రామరాజు హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి మొదలైన పత్రికల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదకత్వం వహించిన గ్రంథాల పీఠికలు చదివారు. అందువల్ల వారిలాగ ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పాలన...
క్రింద ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధం మరియు తాత్పర్యం ఇవ్వండి: ఉ || అందు వృకోదరార్జునుల నాహవ రంగమునందు మీఱువా రెందఱో యెన్నుమా యిచట; నీ గురుభీష్ములఁ గ్రేణిసేయువా రెందఱో; వారు వీరు నని నీల్గుటకంటె భవర్బలంబులై యందఱుఁగూడు టొప్పదె జనాధిప ! శాంతి యొనర్పు మెమ్మెయిన్
ప్రతిపదార్థం : అందున్ = అక్కడ ఉన్న వృకోదర + అర్జునులన్ = భీమార్జునులను ఆవహరంగమునందున్ = యుద్ధరంగంలో మీఱువారు = మించగలవారు ఎందఱో + ఎన్నుమా = ఇక్కడ ఎందరున్నారో నీవే లెక్కించు ఇచటన్ = ఇక్కడ ఉన్న ఈ గురు భీష్ములన్ = ఈ ద్రోణుడిని; భీష్ముడిని క్రేణి + చేయువారు = పరిహరింపగలవారు ఎందఱో ? = అక్కడెందరున్నారు ? వారున్, వీరున్ = అక్...
విశేషణ ఉత్తరపద కర్మధారయము గురించి వివరించి ఉదాహరణలు ఇవ్వండి.
విశేషణ ఉత్తరపద కర్మధారయము : సమాసములోని రెండవ పదము విశేషణమై యుండును. ఉదా : కపోత వృద్ధము -వృద్ధమైన కపోతము తమ్ముకుఱ్ఱలు – కుఱ్ఱవైన తమ్ములు
‘కర్షకుడు, కార్మికుడు’ చేస్తున్న సేవను గురించి చర్చించండి.
కర్షకులు, విరామ మెరుగని కష్టజీవులు. మూడువందల అరవై రోజులూ శ్రమించి వ్యవసాయం పనులు చేసి, మనకు ఆహారానికి కావలసిన ఆహార ధాన్యాలను పండిస్తున్నారు. వారు పశువులను మేమే, మనకు కావలసిన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక కార్మికులు, మనకు కావలసిన నిత్యావసర వస్తువుల్నీ వ్యవసాయ పనిముట్లనూ ఉత్పత్తి చేస్తున్నారు. యంత్రాల ద్వారా వస్తువులు ...
మీ చిన్నప్పటి అనుభవాలను తెల్పండి.
నా చిన్నతనంలో నాకు తొందరగా నడవడం రాలేదు. మా అమ్మ చేయి పట్టుకొని నడిపించేది. కొన్ని మాటలు పలకడం వచ్చేది కాదు. మా అమ్మ ఆ మాటలను పదేపదే పలికించేది. అలా నేర్పింది. ఒకసారి ఒకటవ తరగతిలో ఒక అబ్బాయి నన్ను కొట్టాడు, దానితో బడికి వెళ్లనని ఏడ్చాను. మా అమ్మ నన్నెంతో బ్రతిమాలింది. అయినా వినలేదు. చివరకు అమ్మ కూడా కొట్టింది. తర్వాత చ...
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి భౌతిక శాస్త్రమునకు S.N. బోస్ చేసిన అంశదానములు ఏవి?
వికిరణాన్ని ఫోటాన్లతో కూడిన ఒక వాయువుగా పరిగణించి ప్లాంక్ నియమానికి సరికొత్త ఉత్పాదనను ఇచ్చాడు. ఫోటాన్ స్థాయిలను లెక్కించే ఒక కొత్త క్వాంటమ్ గణాంక శాస్త్రాన్ని అభివృద్ధి చేసాడు.